96మీడియా, విశాఖపట్నం:-జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లుకు దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సి.హెచ్ విశాలాక్షి మాట్లాడుతూ
కుటుంబానికి దూరంగా మన కోసం మన దేశ భద్రత కోసం అహర్నిశలు పహార కాసి , కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కోల్పోయి వీర మరణం పొందుతున్న మన వీర జవనుల కోసం మనం ఒక్క రోజైనా నీవాళులు అరిపించలేకపోతున్నామని ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలెంటైన్స్ డే ప్రాధాన్యత ఇవ్వడం కాదని, తీవ్రవాదులు ఉన్మాదులుగా మారి మన దేశ జవాన్ల మీద ఆత్మాహుతి దాడి చేసిన వేళ 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ రోజున నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. రేపటి భవిష్యత్తు చిన్నారులుదని ప్రతి విద్యా సంస్థల్లోని స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జవాన్లు మృతికి సంతాపంగా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సమీపంలోని అమ్మ ఒడి బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలతో కలసి కొవ్వొత్తుల ర్యాలీను నిర్వహించి సంతాపాన్ని తెలియజేశారు.కార్యక్రమంలో రూప సౌజన్య దాత్రి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులు
Add to favorites 0