96మీడియా,మధురవాడ:
జీవియంసి 5 వ వార్డ్ పరిధి లో గల సాయిరాం కాలనీ కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాలనీ లో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత రమణ గారి ఆర్థిక సహాయం తో అన్నసమారాధన కార్యక్రమం ని కాలనీ పెద్దలు అందరూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గ పాల్గొన్న టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు భక్తులకు అన్నప్రసాధం వితరణ చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుని అన్నసమరాదన ను స్వీకరించారు. ఈ కార్యక్రమం లో టిడిపి భీమిలీ నియోజక వర్గం అద్యక్షలు నమ్మి శ్రీను, వార్డ్ టీడీపీ ఉపాధ్యక్షలు వియ్యపు నాయుడు,గోపాల నాయుడు, బొడ్డేపల్లి రంగ, దుర్గారావు, కర్మోజు గోవిందరావు,ఆవాల నేలయ్య, చిరంజీవి రెడ్డి, యోగేశ్వర రావు,నారాయణ రావు, కర్రి సన్యాసిరావు,ఆవాల నేలయ్య, చిరంజీవి రెడ్డి, వైకుంఠ రావు, యోగేశ్వర రావు,నారాయణ రావు,కర్రి సన్యాసిరావు,మన్మధ రావు తదితరులు పాల్గొన్నారు.