96MEDIA – #AP INDIA

వారాహి యాత్ర విజయవంతం భీమీలి కావాలని ప్రత్యేక పూజలు


96మీడియా,మధురవాడ:- జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి వారాహి విజయ యాత్ర విశాఖలో అడుగుపెడుతున్న సందర్భంగా యాత్ర విజయవంతం కావాలని భీమిలి వీరమహిళ పోతిన అనురాధ ఆధ్వర్యంలో కార్ షెడ్ జంక్షన్ శ్రీ శ్రీ బబ్బెలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధినేత నిర్వహిస్తున్నటువంటి వారాహి విజయ యాత్ర విజయవంతం కావాలని పవన్ కళ్యాణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు గోత్రనామాలతో పూజలు నిర్వహించామని తెలిపారు.ఈ యాత్ర ఈనెల 11వ తేది నుండి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ యాత్రలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో అధికార ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రశ్నిస్తారని తెలిపారు. అధికార వైసిపి ప్రభుత్వ భూకబ్జాలు,ఆక్రమణపై ఆయన పోరాడతారని వివరించారు. పర్యాటక ప్రాంతాలైన ప్రసిద్ధి చెందిన రుషికొండ, ఎర్రమట్టి దెబ్బలను హాయ్ అన్న సందర్శిస్తారని తెలిపారు. ఈ వారాహి విజయ యాత్రను జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం బూత్ కన్వీనర్ ఈఎన్ఎఫ్ చందర్రావు, ప్రచార కమిటీ ఇన్చార్జ్ బివి కృష్ణయ్య,మీడియా ఇంచార్జ్ నాగోతి నరసింహనాయుడు, పోతిన తిరుమలరావు పిళ్ళా శ్రీను,వాండ్రాసి శ్రీను,పోతిన అప్పలరాజు మాస్టర్ ,అనిల్,రాజు మాస్టర్,రాయన రామారావు,ప్రమీల జన సైనికులు, వీరమహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More