96మీడియా,మధురవాడ:
విశాఖ పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీలయ్యాయి. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలనా పరమైన అంశాల నేపథ్యంలో వీరిని జీవీఎంసీ పరిధిలో ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేస్తున్నట్టు అధికారంలో ఉత్తర్వులు జారీ చేసి తక్షణమే విధుల్లో చేరాలని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మధురవాడ జోన్-2 కమిషనర్ బొడ్డేపల్లి రాము ను జోన్-1 కమిషనర్గా బదిలీ చేశారు .ఆ స్థానంలో అనకాపల్లి జోన్-7 కమిషనర్ కె.కనకమహాలక్ష్మిని మధురవాడ జోన్-2 కార్యాలయ జెడ్సీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జీవీఎంసీ కమిషనర్ రాజబాబు.
Add to favorites 0