96మీడియా, విశాఖపట్నం :- అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న నగరాల కులస్తుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిళ్లా సుజాత ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నగరంలో జరిగిన బీసీగర్జన సభలో ఆమె నగరాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2009లో ఐదు జిల్లాల్లోని నగరాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీ-డీలో చేర్చారని తెలిపారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లోని నగరాలను బీసీలుగా గుర్తించాలని, బీసీ -డి నుంచి బీసీ- ఏ కు మార్చాలని కోరారు.
Add to favorites 0