96మీడియా,మధురవాడ:- ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంక్షేమ సంఘం విశాఖజిల్లాశాఖ లోని ఉన్నటువంటి అధ్యక్షలు.అంబటిపూడి సుధీర్ కుమార్,కార్యదర్శి యం.సంపత్ కుమార్,కోశాధికారి మురపాక అనిల్ కుమార్ శర్మ,ఉప కోశాధికారి ఇప్పిలి రామకృష్ణ,కమిటి సభ్యులు. ముడియా నరసింహమూర్తి,ఏడిద గురునాధ శర్మ,మీడియా ఇన్ఛార్జ్ గరిమెళ్ళశ్రీకాంత్,ఎం ఉదయకుమార్,వీరు తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా రాష్ట్ర కార్యవర్గానికి పంపగా…రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు వెలగలేటి సతీష్ కుమార్ శర్మ, కార్యదర్శి అధికార్లా కాళిదాసు, కమిటి సభ్యులు నిష్టల శ్రీరామమూర్తి (రాంబాబు),కలిసి జిల్లాకార్యవర్గంతో సమావేశం ఏర్పాటు చేసి వారియొక్క రాజీనామాను ఆమోదించడం జరిగింది.ఇప్పటి వరకు వారు సంఘానికి చేసిన వారి సేవలను సంఘం ఎప్పుడు గుర్తు ఉంచుకుంటుంది అని తెలియజేసారు.. విశాఖజిల్లా శాఖకు ప్రస్తుత తాత్కాలిక ఆధ్యక్షులుగా చామర్తి.కేశవాచార్యులు,
తాత్కాలిక కార్యదర్శిగా
పిళ్ళాఅరుణ్ కుమార్ శర్మ,వీరిని తేదీ 30-07-2023 నుండి 30-08-2023 వరకు వారు ఈ పదవులయందు కొనసాగుతు ఉంటారని ఆమోదించడమైనది. త్వరలోనే విశాఖ జిల్లా శాఖకు రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కమిటి మరియు ఇంచార్జిల సమక్షంలో కొత్త అధ్యక్షులవారిని ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకొని తదనంతరం రాష్ట్ర కార్యవర్గ సమక్షంలో నూతన ఎన్నిక కాబడిన అధ్యక్షుల సహకారంతో పోర్ట్ పోలియో సభ్యులను నియమించడం జరుగుతుందని కమిటీ వారు మీడియాకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంక్షేమ సంఘం.
Add to favorites 0