96మీడియా, విశాఖపట్నం:-విశాఖ పరిధిలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్య అందించేలా చూడాలని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.ఈశ్వర్ చౌదరి, బి. జార్జి ఫెర్నాండేజ్ సోమవారం విశాఖ కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో కరవు తాండవిస్తోందని, జర్నలిస్టులు కనీసం తమ పిల్లలకు ఫీజులు కూడా చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ జిల్లాలో ఉచిత విద్యే అమలవుతోందని పేర్కొంటూ 2023`2024కాలానికి ఉచిత విద్య అమలయ్యేలా జిల్లా విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించాలని కలెక్టర్ను కోరామని, అందుకు అనంతపురం జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడిరగ్స్ కాపీని కూడా చూపించారు. అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించారన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందకుమార్, విశాఖ అధ్యక్షుడు ఎల్జీ నాయుడు, ఉపాధ్యక్షుడు సుంకర సూర్యం, వాజీ చానల్ బ్యూరో చీఫ్ పైడి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించాలి…విశాఖ కలెక్టర్కు ‘తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం’ వినతి
Add to favorites 0