96MEDIA – #AP INDIA

స్వర్గీయ పిళ్లా కృష్ణంనాయుడు గారికి ఘన నివాళులు

96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ చంద్రంపాలెం గ్రామ పెద్దలు, చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ పూర్వ ధర్మకర్త కీ” శే” పిళ్లా కృష్ణంనాయుడు ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈరోజు చంద్రంపాలెం గ్రామ రచ్చబండ వద్ద కృష్ణంనాయుడు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన చిత్ర పటం వద్ద చంద్రంపాలెం గ్రామ పెద్దలు, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రతినిధులు, చంద్రంపాలెం గ్రామస్తులు తదితరులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కృష్ణంనాయుడు భార్య పిళ్లా అమ్మాజీ, సోదరుడు పిళ్లా రాము, కుమారులు పిళ్లా చంద్రశేఖర్, మహేష్, బంధు మిత్రులు , చంద్రంపాలెం గ్రామ పెద్దలు, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ పార్టీల స్థానిక నాయకులు, చంద్రంపాలెం గ్రామస్తులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కృష్ణంనాయుడు చంద్రంపాలెం గ్రామ అభివృద్దిలోను, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణంలోనూ, శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి, నగరాలు సామాజిక వర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అదే విధంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశారని కొనియాడారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More