96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ స్వతంత్రనగర్ కు చెందిన ఎస్. ఎఫ్.ఎస్.స్కూల్ విద్యార్థిని బి. అబిషా కళ జిల్లాస్థాయి అండర్-17 కేటగిరీ స్కేట్ బోర్డింగ్ విభాగంలో అత్యంత ప్రతిభని కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.విశాఖపట్నం డిస్టిక్ రోలర్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
జిల్లాస్థాయిలో సుమారు 60 మంది క్రీడాకారులపై తన ప్రతిభను కనబరిచి అబిషాకళ ఈఘనత సాధించి జాయింట్ కమిషనర్ వి.ఎం.ఆర్.డి.ఎ. వి.రవీంద్ర చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది. గతంలోను ప్రతిభ కనబరిచి స్కేట్ బోర్డింగ్ లో మెడల్స్ గెలుపొందారు. సుమారు 2సంవత్సరాల కష్టం కృషికి ఫలితం దక్కిందని ఈ విజయంపై తల్లిదండ్రులు బి.ఏం.వి.ప్రసాద్ బాబు, శిల్పా దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ప్రతిభ చూపాలని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం
చేస్తూ అభినందనలు తెలిపారు.
మట్టిలో మాణిక్యం అబిషా కళ….అండర్-17 స్కేట్ బోర్డింగ్ విభాగంలో గోల్డ్ మెడల్.
Add to favorites 0