అమరవీరులకు నివాళులర్పించిన కమాండెంట్ గౌతమి షాలి
96మీడియా, మధురవాడ:- బక్కన్నపాలెం 16వ బెటాలియన్ లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవున్ని ఘనంగా నిర్వహిచారు.కార్యక్రమానికి 16వ బెటాలియన్ కమాండెంట్ గౌతమి షాలి, ఐ.పి.యస్ ముఖ్యతిగా పాల్గొని పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ లోనూ సంఘ విద్రోహశక్తుల నుండి సమాజాన్ని కాపాడటంలోనూ పోలీసు పాత్ర మారువరానిది అని, వీధి నిర్వహణ.లో అమరులైన పోలీసువీరులు ఎప్పటికీ స్పూర్తిప్రదాతలు అన్నారు. అనంతరం దేశ వ్యాప్తంగా గత అక్టోబర్ నుండి ఇప్పటివరకు వీధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 188 మంది పోలీసు అమర వీరుల పేర్లు చదువుతూ సంభందిత కుటుంబ సభ్యులకు తమ ప్రగడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కమాండెంట పి. శామ్యూల్ జాన్ , అసిస్టెంట్ కమాండెంట్లు కె. వెంకటేశ్వర రావు, జి. లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ఐ లు, ఆర్ యస్ఐ లు, ఇతర పోలీసు సిబ్బంది మరియు యూనిట్ మెడికల్ ఆఫీసర్లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.