రాష్ట్ర కమిటీ సభ్యులుచే జిల్లాలో ఉన్న ఏరియా ఇంచార్జెర్లు అందరికీ ఘనమైన సన్మాన సత్కారం జిల్లా కార్యదర్శి మావూడూరి సంపత్ కుమార్
96మీడియా,విశాఖపట్నం:-రాష్ట్రంలో అర్చకులు,పురోహితుల స్థితిగతులు మరింత మెరుగుపర్చడమే ధ్యేయంగా తృతీయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంఘం విశాఖ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు అంబటిపూడి సుధీర్ కుమార్ శర్మ,మావుడూరు సంపత్ కుమార్ శర్మ లు ఒకప్రకటనలో తెలిపారు. విశాఖ పట్నం వన్ టౌన్ పరిధిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి వందలాదిమంది అర్చకులు, పురోహితులు పాల్గొని సందడిచేశారని తెలిపారు.కార్యవర్గ సభ్యుల నిర్ణయం మేరకు 2022-2023 సంవత్సరంలో 10వ తరగతి (రాష్ట్ర,సెంట్రల్ సిలబస్) ఇంటర్ లలో ప్రతిభచూపిన మొదటి ముగ్గురికి స్కాలర్ షిప్ లతో ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.స్కాలర్ షిప్ లకు ఆర్ధిక సహాయం చేసిన సిహెచ్ కేశవాచార్యులు,ఎల్ కామేశ్వరరావు, జ్యోస్యుల శివప్రసాద్ లకు పలు విధాలా కృతఙ్ఞతలు తెలియచేసినట్లు తెలిపారు అనంతరం విశాఖ జిల్లా సంఘంలో ఏరియా ఇంచార్జిలుగా సేవలందిసున్న 42 మందిని ధోవతులు,కండువాలతో చిరు సత్కారం చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో సభ్యులందరి సహకారంతో మరింత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని అధ్యక్ష, కార్యదర్శులు అంబటిపూడి సుధీర్ కుమార్ శర్మ,మావుడూరు సంపత్ కుమార్ శర్మ లు ప్రకటనలో తెలిపారు సంఘం జిల్లా అధ్యక్షులు సుధీర్ శర్మ మాట్లాడుతూ మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సంఘం అంచ లంచెలుగా అభివృద్ధి సాధించిందని అన్నారు జిల్లా అంతటా 25 మంది ఇన్చార్జులు ఉత్సాహంగా పని చేస్తున్నారని అభినందించారు ఈ సందర్భంగా సంఘం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వెల్ల డించారు త్వరలో విద్యా ఆరోగ్యం అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి నట్లు స్పష్టం చేశారు.