96మీడియా,విశాఖపట్నం:-రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నా.. ఏమీ ఇవ్వడంలేదంటూ వైకాపా దుష్ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు..కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తూ జేబులు నింపుకోవటమే ఈ పరిస్థితులకు కారణమన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.జాతీయ రహదారుల నిర్మాణంతో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం గుంతల రోడ్లతో ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ”రోడ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే జోన్కు కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగా చకచకా చర్యలు తీసుకుంటుంది. విభజన హామీలను చాలా వరకు కేంద్రం అమలు చేసింది” అని పురందేశ్వరి చెప్పారు..
కేంద్రం నిధులిస్తున్నా.. వైకాపా దుష్ప్రచారం: పురందేశ్వరి
Add to favorites 0