96MEDIA – #AP INDIA

వారాహి విజయ యాత్ర ను విజయవంతం చేయాలి… జనసైనికులకు పరుచూరి పిలుపు


96మీడియా,అనకాపల్లి:- జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు  నియోజకవర్గంలోని గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో జరగనున్న వారాహి విజయ యాత్ర ను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారం నుండి ప్రతీ గ్రామంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓటు హక్కు పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను వెలికితీసి దాని పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందుకుగాను తాను సైతం గ్రామాల్లో పర్యటిస్తానని భాస్కరరావు గారు తెలిపారు.ఈ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ జనసైనికుడి సూచన మేరకు ప్రతీ జనసైనికుడు హలో ఏపీ బైబై వైసీపీ రింగ్ టోన్ పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ఇదే సమావేశంలో అందరూ రింగ్ టోన్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More