96MEDIA – #AP INDIA

నాగోతి శివాజీ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు… పలు సేవ కార్యక్రమాలు

96మీడియా, భీమిలి:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా మధురవాడ ఏడో వార్డ్ పరిధి కళానగర్లో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా చలివేంద్రం నిరుపేద కుటుంబాలకు చీరల పంపిణీ చేశారు. స్థానిక సాయిబాబా నాల్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సందర్భంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు , ఏడో వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, పాల్గొన్నారు. రాజబాబు చేతుల మీదగా కేక్ కటింగ్ అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . నారా చంద్రబాబునాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ప్రభుత్వంలో బడుగు బలహీనులకు, పేదలకు ఎన్నో పథకాలను అమలు చేసి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందంజలో నడిపించారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని రానున్న రోజుల్లో మళ్ళీ చంద్రబాబు పాలన వస్తుందని కోరాడ రాజబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగోతి అప్పలరాజు,నాగోతి రాము,నాగోతి సూర్య ప్రకాష్, పోతిన సోంపాత్రుడు, పోతిన నాయుడు, బాబులు, పోతిన బుజ్జి, జేపీ రాజు , నాగోతి ఆనంద్,వెంబేకాలనీ నాయకులు, కళానగర్ గ్రామ ప్రజలు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More