96MEDIA – #AP INDIA

మాతృశ్రీ బిల్డర్స్ పి.వి.ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం.

96మీడియా,మధురవాడ:- మాతృశ్రీ బిల్డర్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.మధురవాడ బక్కన్నపాలెం 80అడుగుల రోడ్డులో మాతృశ్రీ బిల్డర్స్ ద్వారా నిర్మితమవుతున్న నూతన వెంచర్ ఆవరణలో… వేసవికాలంలో తీవ్ర ఉష్ణోగ్రత ఉండడంతోవడదెబ్బకు స్థానికప్రజలు,కార్మికులు ఇబ్బంది పడకుండా ఏర్పాటుచేసిన చలివేంద్రం ను శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మాతృశ్రీ సంస్థల అధినేత పోతిన శివ మాట్లాడుతూ..గత 5సం లుగా మాతృశ్రీ బిల్డర్స్&చారిటబుల్ ట్రస్ట్,శ్రీరామబుద్ధ వెల్ఫర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని,సామాజిక సేవతో సంతృప్తి కలుగుతుందని,కార్మికులకు పాదచారులకు, వాహనదారులకు వేసవి దాహార్తి తీర్చేందుకు మజ్జిగ, మంచినీరు,శీతలపానీయాలు అందిస్తామని తెలిపారు. యువకుత సమాజ శ్రేయస్సుకు తమవంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాతృశ్రీ బిల్డర్స్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More