96మీడియా, మధురవాడ:- కులమతాలకు అతీతంగా ప్రజా సేవలో తనకంటూ ఓ ముద్ర వేసుకొని దూసుకుపోతున్న గరే గురునాథ్, రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించి మరందరికో ఆదర్శంగా నిలిచారు. ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు హాజరై కేకే క్యూట్ చేసి కార్యక్రమాని ప్రారంభించారు. మహా విశాఖ 6వ వార్డు పరిధి పీఎంపాలెం లో గల గాయత్రి నగర్ లో నివాసం ఉంటున్న సుమారు 50 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ వేల కె.వి.ఆర్ క్యాటరింగ్ అధినేత, పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు గరే గురునాథ్ అండగా నిలిచి శుక్రవారం నిత్యవసర సరుకులు(5 కేజీలు బియ్యం, పంచదార, గొదిమపింది, సేమియా, జీడిపప్పు, కిస్మిస్సు) అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామ్రాజ్యానికి ప్రతీకగా ఉన్న రంజాన్ పండగను ఆ అల్ల ఆశీస్సులతో ప్రతి ఒక్క ముస్లిం సోదర కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు. అనంతరము గురునాథ్ మాట్లాడుతూ రంజాన్ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రతి ఏటా ఈ విధంగా పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందిస్తున్నానని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పండగలకు తోఫాలు అందించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అందుకే పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిత్యవసరాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ముస్లిం కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 6 వార్డ్ టిడిపి అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, పి.ఎస్.నాయుడు, జి.ఆనందబాబు, సన్యాసిరావు, నాగేశ్వరరావు, రెడ్డి సత్యనారాయణ, బలరాం, సర్వదేవుళ్ళు, గిరి, బబ్బెలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం కుటుంబాలకు అండగా గరే గురునాథ్
Add to favorites 0