96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసం శుక్ల పాడ్యమి శుక్రవారం భక్తులతో కిట కిట లాడింది, ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది, సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్య పంచామృత జలాభిషేకములు ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మ, హరి చరణ్ శర్మ, శాస్త్రోక్తంగా జరిపించడం జరిగింది,
మధురవాడ సాయిప్రియా గార్డెన్ వాస్తవ్యులు శ్రీ వెంకట సత్యం, శ్రీమతి వరలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయంతో ఈరోజు ఆలయంలో పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది, భక్తులకు పులిహోర ప్రసాదం ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేయడం జరిగింది,
శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకట రమణ, పోతిన పైడిరాజు,పిళ్లా రమణ, యస్.ఆర్.బాబు, దుర్గాశి సోంబాబు, మరుపిల్లి ఆనంద్, పిళ్లా మోహన్ శివ కృష్ణ, నాగోతి అప్పలరాజు, పోతిన శివ అప్పారావు,
ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా రాము, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న , పిళ్లా లక్ష్మణ పాత్రుడు, నాగోతి అప్పారావు, పి.అప్పలరాజు, యస్.రమేష్, జి.రామారావు మరియు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు