ఈనెల 25వ తేదీ(నేడు) ఆలయ వార్షికోత్సవం.
27వ తేదీ నుండి 29వ తేదీ వరకు జాతర.
30వ తేదీ అన్నసంతర్పణ.
96మీడియా, మధురవాడ:- జీవీఎంసీ 5,7,వార్డ్ ల పరిధి స్వతంత్రనగర్ శ్రీ లక్ష్మీదేవిఅమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు,వార్షికోత్సవం సందర్భంగా ముహూర్తపురాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఆలయ అధ్యక్షులు వాసుపిల్లి బండియ్య పర్యవేక్షణలో.. కార్యదర్శి బాలుపాత్రో, శ్వేత..దంపతులచే శాస్త్రోక్తంగా ఆలయ ప్రధానార్చకులు పూలఖండం గౌరీప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను వితరణ గావించారు..ఈ సందర్బంగా ఆలయ కార్యదర్శి బాలుపాత్రో మాట్లాడుతూ ప్రతీ ఏటాశ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వచ్చామని,అదేవిధంగా ఈ ఏడాది కూడా వార్షికోత్సవ వేడుక,జాతర కార్యక్రమాలు ఈనెల 25వ తేదీ(నేడు) మంగళవారం ఆలయ వార్షికోత్సవం.
27వ తేదీ గురువారం నుండి 29వ తేదీ శనివారం వరకు జాతర. 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.కావున ఈ వేడుకల్లో భక్తులందరు పాల్గొని శ్రీలక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరనికోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కొత్తాల శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ దిబ్బశ్రీను, ఉప కోశాధికారి దాదిగౌరీశంకర్,అనుపోజు నాగరాజు,బావిశెట్టి జగన్,…కరకాని ఈశ్వరరావు, జోగేశ్వరపాత్రో,ఈరోతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.