96మీడియా,విశాఖపట్నం:- జాతర గట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారు శక్తివంతమైనటువంటి దేవత రూపమని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రిక మరియు కరపత్రాలను హాలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగారు మాట్లాడుతూ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు శక్తివంతమైన అమ్మవారని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని దసరా ఉత్సవాలు తాను కూడా అమ్మవారని దర్శించుకుంటాని తెలియజేశారు. ఆలే కమిటీ సభ్యులు మాట్లాడుతూ తేదీ 15/10/2023 ఆదివారం నుండి తేది 23/10/2023 సోమవారం వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయన్నారు.తేది 15/10/2023 ఆదివారం ఉదయం 8:49 గంటలకు అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమై అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకములు జరుగును, ప్రతీ రోజు ప్రత్యేక అలంకరణతో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అమ్మవారి రూపాలతో అలంకరణ జరుగును, అనంతరం సహస్ర కుంకుమార్చన పుష్పార్చనలు నీరాజనం మంత్ర పుష్పములు ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగును, అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు నీరాజన మంత్రపుష్పం పురాణ ఇతిహాసముల నుండి స్వస్తులు మొదలగు కార్యములు నిర్వహించబడతాయని తెలిపారు.భక్తులు యావన్మంది పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు.కార్యక్రమం లో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ ప్రతినిధులు పిళ్లా సూరిబాబు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్, పట్నాల మూర్తి శర్మ, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు జగుపిల్లి నాని, ఆలయ కమిటీ ప్రతినిధులు యస్.యన్.మూర్తి, దుక్క వరం, పిళ్లా వెంకటరమణ, పిళ్లా రాము, గూడేల రాజు, పిళ్లా సన్యాసిరావు, సామిరెడ్డి రాంబాబు పొట్నూరి హరికృష్ణ, బంక వాసు, కేశనకుర్తి అప్పారావు, పిళ్లా వెంకట చిన్ని తదితరులు పాల్గొన్నారు.
శక్తివంతమైన దైవం జాతర గట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారు… దసరా ఉత్సవాలు గోడపత్రికను ఆవిష్కరణలో మాజీ మంత్రి అవంతి
Add to favorites 0