96మీడియా,మధురవాడ:- జీవీఎంసీ ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత గత కౌన్సిల్ సమావేశాలలో వార్డులో త్రాగునీటి ఇబ్బందులు గురించి ప్రస్తావించగా చేతి పంపు బోర్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా సోమవారం వైయస్సార్ కాలనీ ,స్వాతంత్ర నగర్, జే ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ పిపి 2 కాలనీలలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో చేతిపంపు బోర్లులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ వార్డులో త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను మేము గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో ఈ చేతి పంపు బోర్ల వేయడం జరుగుతుందని,ఇంకా వార్డులో చాలా చోట్ల త్రాగునీటి పైపు లైన్లు మరియు చేత పంపు బోర్లు అవసరం ఉందని వాటి గురించి కూడా మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని అవి కూడా తొందరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు, ఓలేటి శ్రావణ్, నూకరాజు, ఐటిడీపీ మాదాల విజయ్, మోహన్ , మహమ్మద్ అలీ, మురళి,కోళ్ల వెంకటేష్, పిళ్ళా అప్పన్న, కందుల సత్యనారాయణ, పెంటరావు, చందు, ప్రవీణ్, రామకృష్ణ, అరుణ, లక్ష్మి, శ్రావణి,వార్డులో గల మహిళలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ మొల్లి హేమలత చొరవతో చేతి పంపు బోర్లు మంజూరు…ఐదో వార్డులో పలు ప్రాంతాల్లో తీరనున్న నీటి కష్టాలు
Add to favorites 0