96MEDIA – #AP INDIA

10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలతో మాలతాంబ విద్యానికేతన్ ప్రభంజనం

96మీడియా,మధురవాడ:- శనివారం ప్రకటించిన 10వతరగతి 2023 ఫలితాలలో కార్ షెడ్ జంక్షన్.. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దగ్గరలో గల మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు అత్యుత్తమ ఉత్తీర్ణత 584మార్కులతో ఫలితం సాధించినట్లు పాఠశాల ఏ.ఓ. ఆదిమూర్తి తెలియజేశారు. ఎన్.వి.ఎస్.నిఖిలేష్ 584, వి.నిఖిత 583, సిద్ధార్థ రెడ్డి 580మార్కుల తో జయహో… మాలతాంబ అనిపించారు. ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థులను మాలతాంబ విద్యా నికేతన్ కరస్పాండెంట్ సునీల్ మహంతి అభినందనలు తెలియజేశారు.మొత్తం విద్యార్థులలో 500మార్కులు పైబడినవారు 50శాతం,400 మార్కులు పైబడినవారు 40శాతం,అన్ని సబ్జెక్ట్ లలో గరిష్ఠ మార్కులు100కు100 సాధించడం చాలా ఆనందకరమని,584 మార్కులు సాధించిన నిఖిలేష్ కు 10,000/-,583మార్కులు సాధించిన వి.నిఖితకు 5000/- రూ..మరియు జే.సిద్ధార్థ రెడ్డి లకు పాఠశాల అధినేత సునీల్ మహంతి పురస్కార బహుమతి అందజేసారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More