96MEDIA – #AP INDIA

అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ మొల్లి హేమలత.

96మీడియా,మధురవాడ:- కార్పొరేటర్ మొల్లిహేమలత చొరవతో 5వ వార్డ్ అభివృద్ధి పథంలో పయనిస్తోందిఅనడంలో ఎటువంటి సందేహం లేదు. జి.వి.ఎం.సి.నిధులతో చేపడుతున్న…5వ వార్డ్ పరిధిలో బొట్టవానిపాలెం లో సుమారు 16లక్షల వ్యయంతో సిసి డ్రైన్,రాజీవ్ గృహకల్పకాలనీలో 17లక్షల తో బీటీ రోడ్డు పనులు మరియు నేషనల్ హైవే నుండి కార్పెంటర్ కాలనీ వరకు సుమారు 20లక్షల తో బీటీ రోడ్డు పనులు,నగరంపాలెం లో కల్వర్టు కాలువలు మరియు కల్వర్టు నిర్మాణ పనులను శుక్రవారం కార్పొరేటర్ మొల్లి హేమలత పరశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ నేను ఎన్నికల ప్రచారం లో పర్యటించినప్పుడు వార్డ్ లో ప్రధాన సమస్యలు అయిన త్రాగునీరు,కాలువలు కల్వర్టులు అవసరం అని ఈ ప్రాంత ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిందని,నేను గెలిచిన తర్వాత వార్డ్ లో గల సమస్యల పై కౌన్సిల్ లో ప్రస్తావించడం జరిగిందని, తద్వారా వార్డ్ లో చాలా చోట్ల రోడ్లు, కాలువలు,కల్వర్టులు నిర్మాణం జరుగుతోందని, ఇంకా చాలాచోట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సినఅవసరం ఉందని,వీటిని కూడా తొందర లో పూర్తి చేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More