96మీడియా,మధురవాడ: జీవీఎంసీ 7వవార్డు పరిధి (ఆర్టీసీ కాలనీ రోడ్డు) మొగదారమ్మ అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ పంచకర్ల సందీప్. జనసేన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్,చేతుల మీదుగా శీతల పానీయాలు,చల్లని మజ్జిగను పంపిణీ నిర్వహించారు, ఈసందర్భంగా డాక్టర్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ.. సామాజిక,ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.ముఖ్యంగా యువతకు తమకాలనీల అభివృద్ధికి తోడ్పడాలని, సామాజిక సత్ప్రవర్తనతో.. మెలగాలని స్థానిక యువతను కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శాకారి శ్రీనుబాబు,ఈ.ఎన్.ఎస్. చందర్రావు,బీవీ.కృష్ణయ్య, నక్క శ్రీధర్.వార్డు నాయకులు పేకేటి శ్రీనివాస్,యాళ్ల విజయ్ కుమార్,వావులపల్లి చిన్న, వెనుగల శ్రీను,ఆకులశివ,కొల్లి శంకర్రావు,మల్లేష్,సత్తి,రాము, సాయి, ఈశ్వర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ మొగదారమ్మ అమ్మవారి పండగ మహోత్సవం….ముఖ్యఅతిథిగా పాల్గొన్న పంచకర్ల సందీప్
Add to favorites 0