96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నక్కాశ్రీధర్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి పెరగబోతున్న మార్కెట్ వాల్యూను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని,మధురవాడ సబ్ రిజిస్టర్ మోహనరావు కు వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా నక్కాశ్రీధర్ మాట్లాడుతూ.. ఇప్పటికే భవననిర్మాణ రంగం కుదేలైందని,నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని,ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ వ్యాల్యూ ని పెంచి నిర్మాణరంగంపై మరింత భారం మోపవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ వాల్యూను పెంచే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు.కార్యక్రమంలో మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతిన శివ,కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు,కే.రామక్రిష్ణా రావు,ఆర్.వై.కుమార్,అల్లాడ వెంకట్రావు,జి. ఎస్.రెడ్డి. పి,కృష్ణ,,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మార్కెట్ వాల్యూను పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి…మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్.
Add to favorites 0