96MEDIA – #AP INDIA

62 హోటల్స్ పై కేసులు నమోదు…39 లక్షల జరిమానా:జేసీ విశ్వనాథన్

96మీడియా,విశాఖ పట్నం:-

విశాఖ జిల్లాలో ఫుడ్ ఔట్ లెట్స్ బాగా పెరిగాయని,
ఎడిబులే ఐటమ్స్ వాడకం పెరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ కే.ఎస్. విశ్వనాథన్ అన్నారు. ఆయన శనివారం కలెక్టరేట్ లో గల తన ఛాంబర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేసిన టీపీసీ మీటర్స్ ద్వారా హోటల్స్ లో ఆయిల్ తనిఖీలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఆహార శాంపుల్స్
లాబ్ కి పంపుతున్నాము అన్నారు. కొంత మంది
వెజ్ అని చెప్పి నాన్ వెజ్ వంటకాలు అమ్ముతున్నారు అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లాలో
62 కేసులు నమోదు ద్వారా 39 లక్షలు జరిమానా విధించారు అని తెలిపారు. సాధారణంగా ఆయిల్ లో టేపీసి
25 లోపు వుండాలి, కానీ కొన్ని హోటళ్లలో
30 నుంచి 39 వరకు రీడింగ్ గుర్తించామన్నారు. ఈ నూనెతో చేసిన ఆహారం ఆరోగ్యానికి హానికరమని ఆయన హెచ్చరించారు. నిభందనలు ఉల్లంఘించిన కే ఎఫ్ సి
(ద్వారకా నగర్ ) కి రెండు లక్షలు జరిమానా
విధించాము అన్నారు. అలాగే, హోటల్ మేఘాలయ, ప్యారడైజ్, ఆలిష్, ఇన్విటేషన్ 365, శ్యామల డ్రై ఫ్రూట్, రిలయన్స్ ఫ్రెష్ (చిన వాల్తేరు), నాయుడు కుండ బిర్యానీ, నేషన్స్ రెస్టారెంట్లు కి జరిమానాలు విదించాము అని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఆహారం బాగోకున్నా, కల్తి అని అనుమానం వున్నా సరే
ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేయండి అని కోరారు. మీడియా సమావేశంలో ఆహార భద్రత శాఖ సహాయ అధికారి నందాజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ జీ. వీ. అప్పారావు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More