96MEDIA – #AP INDIA

పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి….రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి

మధురవాడలో టీడీపీ,సిపిఐ,సిపిఎం పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

96మీడియా,మధురవాడ:-

పెంచిన విద్యుత్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు రద్దు చెయ్యాలని, స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం మధురవాడ సిపిఐ కర్యాలయంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ అధ్యక్షతన టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది
సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు పిళ్ల వెంకటరావు, గొల్లంగి ఆనందబాబు, దాసరి శ్రీనివాస్, కానూరి అత్యుతరావు, సిపిఎం నాయకుడు రాజ్ కుమార్, ఎం డి బేగం, భారతి తదితరులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 2020 విద్యుత్ సంస్కరణలను బిజెపి ఉన్నరాష్ట్రాలు కన్నా నేను ముందున్నానని, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గడిచిన నాలుగు సంవత్సరాలకాలంలో 50 వేలకోట్ల రూపాయలు భారం వేశారని ఇప్పుడు మరో 17 వేల కోట్లు స్మార్ట్ మీటర్లు పేరుతో వడ్డీస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే పెరిగిన చెత్త సేకరణ పన్ను ఆస్తి మూలధన విలువ పన్ను నీటి పన్నులు సకాలంలో చెల్లించుకోలేక పెరిగిన నిత్యవసర వస్తు ధరలు కొనుగోలు చేసి బ్రతుకు జీవనం సాగించలేక ప్రజలు అవస్థలు పడుతున్న తరుణంలో ములేగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల ప్రజల నడ్డి విరిచే విధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని టీడీపీ సిపిఐ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More