96మీడియా,విశాఖపట్నం:- కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా…ఉత్తరాంధ్ర ప్రజల ఎలివేలుపుగా విరజల్లుతున్న చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆషాడ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు తో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ రకాల నైవేద్యాలను భక్తులు అమ్మవారికి ఆషాడం సారెగా సమర్పించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి, భక్తులు సారెతో తెచ్చిన పలు రకాల నైవేద్యాలతో పాటు కదంబం ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించారు.సాయంత్రం అమ్మవారికి పంచామృత జలాభిషేకాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పి.యం.పాలెం సి.ఐ వై.రామకృష్ణ తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. పట్నాల సుబ్బారావు శర్మ,మూర్తి శర్మ,హరిప్రసాద్ శర్మ, హరి చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజారి కార్యక్రమంలో జక్కం శ్రీధర్,మాలతి దంపతులు,సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు,ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీస రమణ కమిటీ సభ్యులు పోతిన పైడిరాజు,పిళ్లా రమణ,పొట్నూరి హరికృష్ణ,పిళ్లా మోహన్ కృష్ణ, మరుపిల్లి ఆనంద్, పిళ్లా సన్యాసిరావు, నాగోతి అప్పలరాజు, కేశనకుర్తి అప్పారావు, బంక వాసు, యస్.ఆర్.బాబు, గ్రామ పెద్దలు పిళ్లా మధు పాత్రుడు, పిళ్లా శ్రీనివాసరావు, బావిశెట్టి సత్యనారాయణ, పీస రామారావు, పిళ్లా సత్యన్నారాయణ, జగుపిల్లి నాని, బోగవిల్లి నాని, కోన అరవింద్ ముఖ్య సభ్యులు పిళ్లా రాము,ప్రభాకర్ రాజు,పి.వెంకట రమణ, పిళ్లా అప్పన్న,మానం వెంకటరావు, గూడేల కామేశ్వరరావు, పిళ్లా రాజు, యస్.శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతరగట్టు దుర్గాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు… శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
Add to favorites 0