96మీడియా,విశాఖపట్నం:-బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశాఖపట్నం జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నియమితులయ్యారు. ఇంతవరకు ఈవోగా పనిచేస్తున్న రమేష్ నాయుడు కృష్ణాజిల్లా తిరుపతమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు.సహాయ కమిషనర్ బాధ్యతలతో పాటు కనకమహలక్ష్మి ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలను శిరీష నిర్వహిస్తారు.గత ఏడాది జూలై 1నుండి ఈ ఏడాది మార్చి 29వరకు ఆమె కనకమహాలక్ష్మి ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆలయ ఆదాయం పెంపు, భక్తులకు సౌకర్యాలతో పాటు శ్రీ అమ్మవారి మార్గశిర మహోత్సవాలను అద్భుతంగా నిర్వహించి అందరి ప్రశంసలు చూరగొన్నారు.ముఖ్యంగా శ్రీ అమ్మవారి దత్తత దేవాలయం అంబికా బాగ్ శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం వారి ఆస్తులు అనకాపల్లిలో అన్యాక్రాంతం కాగా వాటిని స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉన్నతాధికారుల ప్రశంసలు చూరగొన్నారు దీంతో శిరీషను అమ్మవారి దేవస్థానం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల్లో శిరీష ఈఓగా భాద్యతలు స్వీకరించనున్నారు.
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓగా శిరీష నియామకం.
Add to favorites 0