విశాఖ స్టీల్ ప్లాంట్ ను,ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ను కాపాడుకోవడం విశాఖ జిల్లా ప్రతి ఒక్కరి భాద్యతగా వుండాలని,కాబట్టి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరం ఐక్యంగా పోరాడాలని సీపీఐ, సీపీఎం మధురవాడ జోన్ కమిటీ లు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా వుభయ కమ్యునిస్టు పార్టీ లు నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమం జీ వి ఎం సి 5 వ వార్డు సరదా నగర్ లో స్
సోమవారం ఇంటింటి కి పాదయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది అని,సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పటికీ 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి వుండాలని అన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పించక పోగా వున్న నిరుద్యోగం విపరీతంగా పెంచిందని తెలియ జేశారు.మరో ప్రజలపై తీవ్రమైన భారాలు, పన్నులు వేస్తూ కష్టాలపాలు చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26 న కూర్మన్న పాలెం స్టీల్ ప్లాంట్ అర్చ్ వద్ద భారీ భహీ రంగ సభ జరుగుతుందని,ఈ సభకు సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు బి వి రాఘవులు,కే నారాయణ పాల్గొంటున్నట్లు తెలియ జేశారు.ఈ సభకు భారీ ఎత్తున కార్మికులు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ యాత్రలో సీపీఐ, సీపీఎం నాయకులు డి అప్పలరాజు,వి సత్యనారాయణ,బి భారతి,వి సన్ని పాత్రుడు,కుమార్,కే సుజాత తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ వినసకర విధానాలను ఐక్యంగా ఏదిరించాలి.. వామపక్షలు పిలుపు
Add to favorites 0