96మీడియా,విశాఖ పట్నం:- విశాఖ ఒన్ టౌన్ టర్నర్ చౌల్ట్రి లో గల జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో బుధ వారం రాత్రి ఏసీబీ అధికారులు తనుకీలు నిర్వహించారు. అదనపు ఎస్పీలు షకీలా భాను, శ్రావణి ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రావణి మీడియా తో మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశామని తెలిపారు. అదనపు ఆదాయం, అనధికార వ్యక్తుల గుర్తింపు ఏమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ తనికీలలో ఏసీబీ సీఐ లు శ్రీనివాస్, కిశోర్, విజయకుమార్, ప్రేమ్ కుమార్, సతీష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీలు ఇంకా జరుగుతున్నాయి.
Add to favorites 0