96MEDIA – #AP INDIA

నారా లోకేష్ “శంఖారావం” ను విజయవంతం చేద్దాం…కార్పొరేటర్ మొల్లి హేమలత

96మీడియా,మధురవాడ :- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమం ఫిబ్రవరి 17 న భీమిలి నియోజకవర్గం లో జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమం నకు ఐదో వార్డ్ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐదో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 5 వ వార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆమె మాట్లాడుతూ రానున్న ఎలక్టన్ సంగ్రామం లో ఈ సైకో ముఖ్యమంత్రిని గద్దె దించాలనే నినాదం తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖారావం అనే కార్యక్రమం తో ఈ ప్రభుత్వం చేపడుతున్న దుష్ట పరిపాలనను ప్రజల్లో ఎండగడుతూ రానున్న ఎలక్షన్ లో టిడిపి జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని,ఈ కార్యక్రమం కు మన వార్డ్ నుండి అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాంద్రశి అప్పలరాజు, భీమిలి నియోజకవర్గం టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను ,భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు, యువత అధ్యక్షులు కొండపు రాజు, బీసీ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగరావు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొత్తల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు చలమోలు శ్రీనివాసరావు (గడ్డి శ్రీను), ఆనందరావు, కామరాజు, జోగేశ్వరరావు పాత్రో,సంభాన సుజీవరాజు, కామరాజు,ద్వరపు రెడ్డి కృష్ణ, నూకరాజు,ఓలేటి శ్రావణ్,మొకర రవికుమార్,సూర్య చంద్ర, యార్రయ్య రెడ్డి, గంగారాపు ,హరికృష్ణ,ఇమ్మంది రాజు, షేక్ మదీనా,జ్ఞానేశ్వర్ రావు, చక్రపాణి,నాగేశ్వరరావు, షణ్ముఖ,పిల్ల వెంకట్రావు, శ్యాము, మహిళా నాయకురాలు సరస్వతి, అరుణజ్యోతి ,సునిత,వనిత,గండి రామనాయుడు.గంట రమేష్,తంగుడు మోహన్ రావు,ముకుందరావు,మండ సతీష్ కుమార్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More