96మీడియా,భీమిలి:- జై భారత్ భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ఇల్లిపిల్లి అనిల్ కుమార్ నామినేషన్ వేశారు బుధవారం మండుటెండను సైతం లెక్కచేయక, పార్టీ అభిమానులు, కార్యకర్తలు తో కలిసి ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి , భీమిలి నియోజకవర్గం ఆర్డీవో కు అందజేశారు, ముందుగా జై భారత్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో స్థానిక మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు, నామినేషన్ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం ఇప్పటికీ వెనకపడే ప్రదేశం గా ఉంది అని, నాయకులు స్వార్థ రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు, భీమిలి లో జై భారత్ పార్టీ జెండా ఎగరవేయడానికి భీమిలి నియోజకవర్గంని గెలిపించి, మే 13న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గం గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జై భారత్ పార్టీ భీమిలి అభ్యర్థిగా ఇల్లిపిల్లి అనిల్ కుమార్ నామినేషన్
Add to favorites 0