96MEDIA – #AP INDIA

జనసేన నేత నక్కా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి

రక్తదాన శిబిరానికి విశేష స్పందన… సుమారు 250 మంది రక్తదానం

2024 లో వచ్చేది జనసేన-టిడిపి ప్రభుత్వమే…!
సందీప్ పంచకర్ల.

96మీడియా,మధురవాడ:- జాతిపిత మహాత్మా
గాంధీ జయంతి వేడుక మరియు రక్తదాన శిబిరం జనసేన ఆధ్వర్యంలో మధురవాడ నగరంపాలెం రోడ్డులో  ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు నక్కాశ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి స్థానిక టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు.ముఖ్యఅతిథులుగా జనసేన భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సందీప్,సీనియర్ నాయకులు ఈ.ఎన్.ఎస్.చందర్రావు, నాగోతి నర్సినాయుడు,టిడిపి సీనియర్ నాయకులు పిల్లా వెంకటరావు,జీవీఎంసీ 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ,పిల్లా నర్సింగరావు.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.సుమారు250 మంది రక్తదానం చేశారు.ఈ సందర్భంగా పంచకర్ల సందీప్  మాట్లాడుతూ…భారతదేశాన్ని దోచుకుంటూ.. భారతీయలను బానిసలుగా చేసిన బ్రిటిష్‌ పాలకులతో శాంతియుతంగా పోరాటం చేసి.ఉప్పు సత్యాగ్రహంతో భారత ప్రజలను ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఘనంగా మహాత్మాగాంధీకే దక్కుతుందన్నారు. 2024 లో వచ్చేది జనసేన-టిడిపి ప్రభుత్వమేనని,జగన్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని అన్నారు.ఈ సందర్భంగా 50మంది యువతను జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన నాయకుడు నక్కా శ్రీధర్ మాట్లాడుతూ.. దేశం కోసం ఎనలేని సేవలు చేసిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు.గాంధీ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన జన సైనికులకు, దాతలకు ప్రత్యేక ధన్యవాదములుతెలిపారు. రక్తసేకరణలో ప్రధాన భూమిక పోషించిన లయన్స్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు,వారిసిబ్బందికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేకరి శ్రీనివాస్, దేవి యాదవ్,ఆకుల శివ, అప్పలరెడ్డి,వి కొండయ్య,ఎస్.వి.రమణ, మిలటరీ రమణ, టిడిపి నాయకులు కానూరి అచ్యుత్, దుర్గా,తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More