96మీడియా,విశాఖపట్నం :- ఆరిలోవ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె రెండువ జోన్ 11వ వార్డు పరిధిలోని గాంధీనగర్లో జివిఎంసి నిధుల నుండి రూ.22 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, సిసి కాలువలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరిలోవ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. గాంధీ నగర్ లో రూ.22 లక్షలు వెచ్చించి రోడ్లు, కాలువలు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామన్నారు. పనులు వెంటనే ప్రారంభించి నిర్ణయత సమయానికే అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జివిఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అప్పాజీ, వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Add to favorites 0