96మీడియా,విశాఖపట్నం:- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిడిఎంఎ, జిల్లా ప్రత్యేక అధికారి పి.కోటేశ్వరరావు వైద్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన 2వ జోన్, 10వ వార్డు రవీందర్ నగర్ పరిధిలోని సుందర్ నగర్ లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జివిఎంసి కమిషనర్ సి.ఎం.సాయికాంత్ వర్మతో కలిసి సందర్శించారు. హాస్పటలలో గల మౌలిక వసతుల వివరాలను డిఏంఓహెచ్ ను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ కు ప్రతి రోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారని, పడకలు ఎన్ని ఉన్నాయి.., మందుల వివరాలు, చికిత్స అందించే విధానం, ఎంతమంది వైద్యులు, ఇతర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో తాగునీటి కొరకు ఆర్.ఓ. ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్లు వై.శ్రీనివాసరావు, డాక్టర్ వి.సన్యాసిరావు, డిఏంఓహెచ్ జగదీశ్వరరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఏఎంఓహెచ్ డాక్టర్ ఎన్.కిషోర్, డిపిఓ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.