96మీడియా,మధురవాడ :టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి సభలో మాట్లాడుతూ పేదలకు జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సెంటు స్థలం సమాధి కట్టడానికి సరిపోతుంది అని అహంపూరిత మాటలు మాట్లాడడం వింటుంటే చంద్రబాబు నాయుడు అసలు మనిషేనా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసారు. అర సెంటు ఇంటిలో జన్మించిన చంద్రబాబు కోట్లకు పడగలెత్తి పక్క రాష్ట్రమైన తెలంగాణ లో సుమారుగా 150 కోట్ల రూపాయలతో ఇంద్రభవనం లాంటి ఇంటిలో ఉంటున్న మీకు సెంటు విలువ తెలియదని,ఇల్లు లేని నిరుపేదలకు వాటి విలువ తెలుసు గనుకే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని రాజేశ్వరి తెలిపారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నిన, రాష్ట్రం లో పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి పేదలకు ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి పేదల పట్ల ఇలాంటి అహంపూరిత మాటలు మాట్లాడితే ప్రజలే తిరగబడతారని రాజేశ్వరి అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలకు గాను 175 స్థానాలు విజయం సాధించి జగనన్నకు బహుమతి గా ఇవ్వాలని బడుగు బలహీన వర్గాలు,బీసీ, మైనారిటీ లు, రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారని ముదుండి రాజేశ్వరి మీడియా ముఖంగా తెలియజేసారు.
పేదలకు అందించే సెంటు స్థలంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ ముదుండి రాజేశ్వరి
Add to favorites 0