96MEDIA – #AP INDIA

కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో కళింగ వైశ్యలకు బీ.సి.”డి” సర్టిఫికేట్

  • 96మీడియా,మధురవాడ : అంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్&డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అందవరపు సూరిబాబు సూచన మేరకు డైరెక్టర్స్ సకలాభక్తుల.ప్రసాదరావు, పొట్నూరు మాధవి మదుసుధన్ రావు ఆద్వర్యంలో శుక్రవారం విశాఖపట్నం జిల్లా చిన్న గదిలి మండల తహశీల్దార్ రమణయ్యను కలిసి వినతిపత్రం సమర్పించి మా కళింగ వైశ్య కుటుంబీకులకు బీ.సి.”డి” సర్టిఫికేట్ జారీ చేయడంలో జరుగుతున్న జాప్యతను, నిర్లక్ష్య ధోరణిని వివరించడం జరిగింది.
    ఈ సందర్భంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ , అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాలకు ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో, అంటే L.Dis.No.820/2022/Magl-C1 dt:05-05.2022 ప్రకారం, అలాగే ఇదివరకు ప్రభుత్వం వారు కల్పించిన G.O.Ms.No.10 Dt:24-09-2014, SL.No.48 ప్రకారం బీ.సి.”డి” సర్టిఫికేట్స్ మంజూరు చేయాలని కోరగా దానికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా జీ.ఓ ప్రకారం సర్టిఫికేట్స్ మంజూరు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ తో పాటు పాల్గొన్న విశాఖ జిల్లా సంఘం నాయకులు పెంట చంద్రభూషణరావు, జిల్లా సంఘం మరియు అక్కయ్యపాలెం సంఘం కమిటీ మెంబర్ జామి.రామారావు, ఆరిలోవ సంఘం అధ్యక్షులు జామి సాంబమూర్తి, సెక్రెటరీ వడ్డి.నాగరాజు, కోరాడ.వెంకటేష్, గుడ్ల.పకీరు, సాగర్ నగర్ సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ కుమార్, సెక్రటరీ పొట్నూరు బాబురావు , మధురవాడ సంఘం సెక్రటరీ పొట్నూరు గణేష్, సకలాభక్తుల శ్రీనివాసరావు, పెంట బాబ్జి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More