96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ కొమ్మాది పైడితల్లి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు మూడవ రోజు ఘనంగా జరిగాయి, ముందుగా అమ్మవారి విరాట్ కు పంచామృత సుగంధ,జలాభిషేకములు జరిపించి అనంతరం ఈరోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు,ప్రత్యక పూజలు,ప్రసాదాలు వితరణ చేసారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తుల పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.అంపోలు ధరణి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కొమ్మాది అయ్యప్ప భక్త బృందం, కొమ్మాది గ్రామ యువత, మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
కొమ్మది గ్రామంలో ఘనంగా దేవి నవరాత్రులు…శ్రీ అన్నపూర్ణ దేవిగా పైడితల్లి అమ్మవారు
Add to favorites 0