96మీడియా,మధురవాడ:- మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ భీమిలీ నియోజక వర్గం ఇంఛార్జి కోరాడ రాజబాబు ఆదేశాలు మేరకు 5 వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యం లో 5వార్డ్ టీడీపీ ఆఫీస్ నందు ‘కాంతి తో క్రాంతి’ అనే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ఇంటి ఆవరణంలో ఉన్న లైట్లు ను ఆపి కొవ్వొత్తులు,మొబైల్ లైట్లు వెలుగు లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాంటి మచ్చ లేకపోయినా కేవలం వ్యక్తిగత కక్షతో ఆయనపై బురదజల్లే విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునకని,ఈ విధమైన రాజకీయాలు ప్రజాక్షేత్రం లో ఆమోదయోగ్యం కాదని ఆమె తెలిపారు. వ్యక్తిగతంగా కాకుండా అభివృద్ధిలో పోటీ పడాలని అది చేతకాక ఈ విధంగా ప్రజలను తప్పు దారి పట్టించడం తగదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ టిడిపి ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు,ఎస్ సి సెల్ అధ్యక్షులు లంక రాజేంద్ర ప్రసాద్(పొట్టి ప్రసాద్), బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొత్తల శ్రీనివాసరావు,తెలుగు యువత సూర్య,ఓలేటి శ్రావణ, నమ్మి వాసు,చక్రి, లక్ష్మణరావు ,చిన్న రమణ,బాలాజీ,వెంకటేష్,వి రమణ, పాలవలస రమణ, వంక నూకరాజు, ఐ టి డి పి మాదాల విజయ్ ,జీవన్ ,ఈగల కిరణ్, దాసరి రమణ, బొట్ట అప్పలరాజు , బోట్ట కనకరాజు, వెంకటేష్ ,గోపి, మురళి, మంగరాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
‘కాంతితో క్రాంతి’ పేరుతో టీడీపీ 5 వ వార్డ్ లో నిరసన కార్యక్రమం
Add to favorites 0