96MEDIA – #AP INDIA

అయోధ్య శ్రీరామ అక్షింతలు వితరణ

96మీడియా, విశాఖపట్నం జీవీఎంసీ ఆరో వార్డు పరిధి కోమ్మాది జంక్షన్ త్రిశక్తి ఆలయంలో అయోధ్య శ్రీరామ అక్షింతలు వితరణ చేశారు.ఆరో డివిజన్ బీజేపీ అధ్యక్షులు జిఆర్ఎస్ఎన్ రాజు(పెదబాబురాజు) అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆదర్శ పురుషుడు, ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముల వారి అయోధ్య క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలు పూజ అనంతరము భక్తులకు అక్షింతలు వితరణ చేసినట్లు తెలిపారు.కార్యక్రమాని భక్తులు విశేష స్పందన లభిస్తుందన్నారు. అక్షింతలు అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో యండాడ మండల కన్వీనర్ ఎ. సురేంద్ర కుమార్,ఉపాధ్యక్షులు పిళ్ళ ఈశ్వరరావు,కార్యదర్శి జి చంద్ర శేఖర్ రాజు, కోశాదికారి పి సత్యసాయి,పూర్వపు ప్రధానకార్యదర్శి పిళ్ల హిమాలయన్,కార్యవర్గ సభ్యులు బి మురళీకృష్ణ,ఈశ్వరరావు,పిళ్ళ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More