ఆహ్లాదకరమైన వాతావరణం లో అర్చక పురోహితుల కుటుంబాల ఆత్మీయ కలయిక
బ్రాహ్మణలు పురోగాభివృద్దే మా లక్ష్యం బాల భాను అర్చక మరియు పురోహిత సంఘం
ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉపకార్ సేవ సంస్థ అధినేత కంచర్ల అచ్చుతరావు
96మీడియా,విశాఖపట్నం:- శివాజీ పార్క్ లో మార్గశిర మాసం పురస్కరించుకొని బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబాలతో వన మహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉపకార్ అధినేత కంచర్ల అచ్చుత రావు విచ్చేసారు సంఘం కార్యవర్గ సభ్యులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు అయిన దీప ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ముందుగా అధ్యక్షులు జోష్యుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణలు పురోగాభివృద్దే మా లక్ష్యం బాల భాను అర్చక మరియు పురోహిత సంఘం అని సంఘం కార్యవర్గ సభ్యులు మరియు సంఘం లో సభ్యులు అందరి సహాయ సహకారాలతో వార్షికోత్సవం, వన మహోత్సవం, ఉగాదికి పంచాంగం వితరణ, క్రీడ మహోత్సవ వంటి కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు ప్రతిభా వంతులుకు సంఘం తరపున ప్రశాంస పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు.