96మీడియా, ఆనందపురం:- సెంటర్ అఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ 4 .ఒ ను సంస్థ సీఈవో రవి ఈశ్వరపు, ఎ.యు ఇన్నోవేషన్ మరియు కళాశాల చైర్మన్ నడింపల్లి సత్యనారాయణ రాజు ల చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ప్రస్తుత తరుణం లో ప్రాక్టికల్ ఇన్స్డ్స్ట్రియాల్ ట్రైనింగ్ విద్యార్థులకు ఇవ్వడం చాల అవసరం. ఈ దిశగా NSRIT కళాశాల అడుగులు వేయడం ప్రశంసించారు. కళాశాలలో ఇండస్ట్రీ సెంటర్ మొదలవడం భవిష్యతులో విద్యార్థులకు చాల ఉపయోగ పడుతుందని, ఇది శుభ పరిణామం అని కొనియాడారు. విద్యార్థులను హాక్త్తోన్ లో, కోఆడింగ్ ప్లాట్ఫారం లో ప్రాబ్లెమ్ సాల్వ్ చేయడం, విద్యార్థులకి ఉపాధి అవకాశాలు పెంపొందిసుందని చెప్పారు. కళాశాల చైర్మన్ గారు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురుంచి NSRIT నిర్విరామంగా కృషి చేస్తుందని చెప్పారు. సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన Vihaan ఎలెక్ట్రిక్ సీఈఓ వెంకట రెడ్డి మాట్లాడుతూ NSRIT కళాశాలలో ఈ ఇండస్ట్రీ సెంటర్ని స్థాపించడానికి ఇంఫ్రాస్ట్రుక్చర్ ని ప్రొవైడ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రెట్రరీ డాక్టర్ ప్రసాద రాజు, ట్రేసర్ర్ కానక రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. శంభు ఫ్రసాద్, డైరెక్టర్ డా. రాజా మురుగ దాస్, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ స్ ఆర్ కృష్ణం నాయుడు, వివిధ విభాగాధిపతులు ,ఐ. ఐ. ఎల్ కోఆర్డినేటర్ ఉషా రాణి తదితరులు పాల్గొన్నారు.
ఎన్ స్ ర్ ఐ టి లో సెంటర్ అఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ 4 .O ప్రారంభోత్సవం
Add to favorites 0