96MEDIA – #AP INDIA

ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు…కాకర సురేష్ కుమార్


96మీడియా,ఆనందపురం( వెల్లంకి) :- ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని వృక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు కాకర సురేష్ కుమార్ సూచించారు.వెల్లంకి జిల్లా పరిషత్ హై స్కూల్ లో కెరీర్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వృక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు కాకర సురేష్ కుమార్ మరియు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను చదువుపై దృష్టి పెట్టి, రాబోయే పరీక్షలలో  మంచి ఫలితాలను సాధించాలనే ఆకాంక్షించారు.
విద్యార్థిని విద్యార్థులకు  ఉమెన్ సేఫ్టీ,కమ్యూనికేషన్ స్కిల్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తూ, 
విద్యార్థి దశనుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారన్నారు.
ప్రతి సంవత్సరం  ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ,అందులో భాగంగానే   పరీక్ష సామగ్రిని  అందించారు.
అలాగే విద్యార్థులు పరీక్షల  సమయంలో  తెసుకోవాల్సిన జాగ్రత్తలు  ,నియమాలను  వివరించారు .ఉత్తమ ఫలితాలు రావాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో వృక్ష ఫౌండేషన్ సభ్యులు సాడి శంకర్, కిరణ్, పూర్ణ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న వృక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు కాకర సురేష్ కుమార్
Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More