96MEDIA – #AP INDIA

అమాయక గీత కార్మికులు కుటుంబాలకు అన్యాయం చెయ్యొద్దు ! :సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు

అమాయక గీత కార్మికులు కుటుంబాలకు అన్యాయం చెయ్యొద్దు !

వీరి న్యాయమైన పోరాటానికి సిపిఐ అండగా ఉంటుంది

సి ఐ డి అధికారులు వేధింపులు అపాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు

96మీడియా,మధురవాడ:- జీవీఎంసీ జూన్ 1 ఏడవ వార్డు పరిధిలోని పాత మధురవాడలో

రైతులకు అండగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు .
ఈ సందర్బంగా సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ మధురవాడ గ్రామ సర్వే నెం 274/1 లో 40 సెంట్లు జిరాయితీ భూమినిపాత మధురవాడ లో నివాసములుంటున్న పేద గీత కార్మికుల కుటుంబానికి చెందిన టేక్ పూడి పెద్ద అప్పన్న పీస పైడితల్లి వగైరాలు వలన అప్పటి మధురవాడ గ్రామ పెద్దలైన పోతిన సత్యనారాయణ మూర్తి, పిల్ల సత్యనారాయణ మూర్తి గార్ల సమక్షంలో 1957 వ సం” జులై 17 వ తేదీన దస్తావేజు నెం 2020 కొనుగోలు చేసుకొని జీవిస్తున్నారని 2001 లో కుటుంబం అవసరాలు కోసం ఇందులో 20 సెంట్లు భూమిని ఐదుగురు వ్యక్తులకు అమ్మారు. ఈ ఐదుగురు ఈ స్థలాల్లో ఉడా, జీవీఎంసీ అనుమతులతో ఇల్లు కట్టుకొని జీవస్తున్నారు. మిగిలిన 20 సెంట్లు స్థలం లో గీత కార్మికులు పాకలు, షెడ్లు నిర్మించుకొని బతుకుతున్నారని 2004 సెప్టెంబరు 24 వ తేదీన లో పోతిన రమణ అలియాస్ పొట్టి రమణ జీవీఎంసీ పూర్వ 5 వ వార్డు కార్పొరేటర్ పోతిన హనుమంతురావు సహాయ సహకారాలతో దస్తావేజు నెం 3589 దొంగ రీజస్టేషన్ చేయించుకొని కె శివరామరాజు అనే వ్యక్తికి అమ్మారని,
ఇది ఇది తెలిసిన రైతులు న్యాయస్థానం లోను, సిట్ లోను పిర్యాదు చెయ్యగా న్యాయస్థానం, సిట్ విచారణ చేసి ఈ భూమి రైతులకు చెందినదని తీర్పు ఇచ్చాయని పైడిరాజు తెలిపారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోని పెద్దలు సి ఐ డి అధికారులతో బెదిరింపులు చేస్తూ అమాయక గీత కార్మికులను బెదిరించి భయబ్రాంతులకు సృష్టిస్తున్నారని మీరు ఏదోలా సెటిల్ చేసుకోక పొతే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారని, వారు ఎటువంటివారో మీకు తెలీదని, అన్ని రకాల అధికారాలు కలిగిన వారని, మిమ్మల్ని బతకనివ్వరిని చెప్పుతున్నారని ఇది అన్యాయమని ఈ అంశం లో సి ఐ డి అధికారులు అధికారపార్టీ నాయకులకు కొమ్ముకాయడం, సహాయ సహకారాలు అందించడం దుర్మార్గం అని పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న శనివారం విశాఖ పోలీస్ డి సి పి గారికి సి ఐ డి అధికారులపై కూడా పిర్యాదు చేశారని రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ వీరికి అండగా ఉంటుందని పైడిరాజు తెలిపారు.
ఈ నిరసన లో రైతులు కుటుంబాలతో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ విమల, ఎస్ కె రెహమాన్, ఎం డి బేగం, వి సత్యనారాయణ, కె మేఘారావు, కె కుమార్, మూగి సూర్యనారాయణ, నారాయణరావు, టి సత్యనారాయణ, వి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More