96MEDIA – #AP INDIA

జి – 20 సదస్సుకు విశాఖ నగరం ముస్తాబు

  96మీడియా,విశాఖపట్నం:- జి–20 సదస్సుకు దాదాపు సుందరీకరణ పనులు పూర్తి అయ్యాయని జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగర అందాలను జి-20 సదస్సుకు వచ్చే అతిధులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతామని, దాదాపు పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు మరో 3 రోజులలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. సువిశాలమైన సముద్ర తీర ప్రాంతంగల విశాఖ నగర అందాలు అతిధులను ఆకర్షించే విధంగా తీర్చి దిద్దుతున్నామని, అతిధులు విశాఖ నగరంలో పర్యటించే సమయంలో జివిఎంసి చేపడుతున్న పలు ప్రాజెక్టులను వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తామని తెలిపారు. అందుకు సంబంధించి ఆయా ప్రాజెక్టు అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. జి-20 సదస్సు జరిగే ప్రాంతాలకు తెలిపేందుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందున ఈ సదస్సును ఎటువంటి లోటుపాటులు లేకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో కలసి పనిచేస్తున్నామన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More