96మీడియా, తగరపువలస:- విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన జనగణమనను జాతీయ గీతంగా భారతరాజ్యాంగ సభ ఆమోదించి 73 సంవత్సరాలు పూర్తియిన సందర్భంగా స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహిస్తున్న జయహో జనగణమన వారోత్సవాలు లో భాగంగా తగరపువలస సాయి రవీంద్ర స్కూల్ విద్యార్థులుతో గీతలాపన చేయడం జరిగింది.. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు రాజేటి బసవక్రిష్ణమూర్తి మాట్లాడతా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు,సరిహద్దులు, ఆచార వ్యవహారాలు అద్దం పట్టేలా రవీంద్రనాద్ ఠాగూర్ జనగణమన ను రచించారు అని, గీతాలాపన చేయడం ప్రతి భారతీయుడు బాద్యత అని అన్నారు..ఇలాంటి మంచి కార్యక్రమలు చేస్తున్న బసవ క్రిష్ణ మూర్తి ని పాఠశాల యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యూయ్ కేర్ యు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెంపడ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ కరెస్పాండెంట్ భోగేల క్రిష్ణ, ప్రిన్సిపాల్ వాండ్రసి సతీష్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు..
సాయి రవీంద్ర స్కూల్లో జయహో జనగణమన..
Add to favorites 0