96MEDIA – #AP INDIA

నగరాలు కులస్తులకు కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయించాలి


96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారికి విశాఖపట్నం జిల్లా పరిధిలో నగరాలు కులస్తులు సుమారు రెండు లక్షల మంది ఉన్నారని మాకు ఎక్కడా వివాహాది శుభకార్యాలు చేయుటకు కళ్యాణ మండపాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం, కావున విశాఖపట్నం జివియంసి పరిధి మా కులానికి ఒక ఎకరా స్థలం కేటాయించాలని భీమిలి శాసన సభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి సమక్షంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు,వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిళ్లా సూరిబాబు తదితరులు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అందించి కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు సానుకూలంగా స్పందించినట్లు వారు మీడియాతో తెలిపారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More