96మీడియా,మధురవాడ:-మధురవాడ ప్రాంతానికి చెందిన అచ్చమాంబ కన్స్ట్రక్షన్స్ అధినేత అల్లాడ వెంకట్రావు,మంగా దంపతుల కుమార్తె నేహా ద్వితీయ వర్ధంతి సందర్భంగా మధురవాడ అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పి.ఎం పాలెం లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామకృష్ణ పాల్గొని పిల్లలకు భోజనాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందాలని ఆశించారు. ముందుగా గయి నేహా ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి, భగవంతుని ప్రార్థించారు.కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ వంకాయ మారుతీ ప్రసాద్,సీనియర్ జర్నలిస్ట్ బంగారు అశోక్ కుమార్, హాండ్స్ టూ హెల్ప్ చిన్ని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
గయి నేహా ద్వితీయ వర్ధంతి సందర్భంగా అమ్మఒడి పిల్లలకు భోజనం ఏర్పాటు
Add to favorites 0