96మీడియా,మధురవాడ:- జీవీఎంసీ ఆరోవార్డు రేవల్లపాలెం శ్రీనివాస స్కూల్లో సైన్స్ తోని పురష్కరించుకొని సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాల్లో చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.శ్రీనివాస్ విద్యాసంస్థల చైర్మన్ ఆర్ సి హెచ్ శ్రీనివాసరావు, శ్రీ సాయి సూర్య కన్స్ట్రక్షన్స్ అధినేత వాండ్రసి అప్పలనాయుడులు సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి సిబ్బందితో కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ గౌతమ్ మాట్లాడుతూ సర్ సివి రామన్ జన్మదిన సందర్భంగా ఈ సైన్స్ ఫెయిర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో సుమారుగా 60 స్టాల్ ను విద్యార్థులు ఏర్పాటు చేశారన్నారు. భౌతిక, రసాయనిక,ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ తో పాటు అనేక విభాగాల్లో సైన్స్ ఫెయిర్ స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇటువంటి సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు వల్ల విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారికి మరింతగా ప్రోత్సహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
శ్రీనివాస స్కూల్లో ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్
Add to favorites 0