96మీడియా,విశాఖపట్నం:- ఓ ఎస్ జి ఫౌండేషన్ సేవలకు 20 రుపీస్ ఫౌండేషన్ చిరు సత్కారాన్ని అందించింది. ఆ సంస్థ నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ ఓ ఎస్ జీ ఫౌండేషన్ నీ సత్కరించారు అలాగే వేసవికాలంలో రక్త కొరత తక్కువగా ఉంటుందని గమనించిన సమస్త వ్యవస్థాపకుడు భాను నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేశానని అదే విధంగా నాతోటి మరికొన్ని స్వచ్ఛంద సంస్థలను పిలిచి నా బాధ్యతగా వారిని సత్కరించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు భాను శ్రీకాంత్ శివయ్య బాలాజీ మరియు వారి మిత్రబృందం పాల్గొన్నారు.సుమారుగా 40 మంది రక్తదాతలు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారని ఈ రక్తాన్నంత లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారు సేకరించి ప్రమాదంలో ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకు క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడేలాగా శుద్ధిచేసి వారికి అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఓ ఎస్ జి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు…20 రూపీస్ ఫౌండేషన్ చిరు సత్కారం
Add to favorites 0